లారీ డ్రైవర్ గా స్టైల్ స్టార్ అల్లు అర్జున్
"అల వైకుంఠపురంలో" సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి తన అభిమానులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మంచి ప్రమోషన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఈమధ్యే విడుదలైన రెండు పాటలు అల్లు అర్జున్ ఫాన్స్ తో పాటు సినిమా ప్రియులను సైతం అలరించి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఆయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన తరువాత సినిమా సుకుమార్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో అతని కారక్టర్ ఏంటనేది ఫాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ లారీ డ్రైవెర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసతో అలరించబోతున్నాడు. దీనికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
ఈ సినిమాలో గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్నా అల్లు అర్జున్ కి జోడీగా నటించనుంది.
త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారభంకానుంది.
ఈ సినిమాకి సంబందించి ఇతర నటీనటులు, టెక్నీషియన్లను త్వరలో ప్రకటించనున్నారు.
No comments:
Post a Comment