జబర్దస్త్ కి హైపర్ ఆది, అనసూయ ఇక బాయ్ బాయ్?
సౌత్ ఇండియా లోనే అత్యంత ప్రజాదరణ పొందిన కామిడీ షోలలో జబర్దస్త్
టాప్ పొజిషన్లో ఉంటుందనడంలో అనుమానం లేదు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు టాలివుడ్
కి పరిచయమయ్యారు. 7 సంవత్సరాలనుండి ఈ షో నిర్విరామంగా కొనసాగుతూ ఎంతోమందికి లైఫ్ ని
ఇచ్చింది ఇంకా ఇస్తునే ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సిన పేర్లు యాంకర్లైన అనసూయ,
రష్మి. టీంలో ఒకరిగా ఉంటూ తమ టాలెంట్ తో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, వివిధ గెటప్
లతో, ఆటో పంచ్ లతో అలరించే గెటప్ శ్రీను మరియు ఆటో రాంప్రసాద్.
ఈ షోని చూసి ఇతర ఛానల్స్ కూడా ప్రయత్నం చేశాయి, కాని ఏవీ కూడా
జబర్దస్త్ దాటికి తట్టుకోలేక మద్యలోనే ఆపేసాయి. అయితే ఇప్పుడు జబర్దస్త్ కి పోటీగా
ఒక చానెల్ వాళ్ళు ప్రొగ్రాం తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ షోలో ఆల్రెడీ పాపులర్ అయిన జబర్దస్త్
కండియన్స్ ని రప్పియడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
అయితే ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది, అనసూయ, సుడిగాలి సుధీర్,
రష్మీ పేర్లు వినబడుతున్నాయి. ఎందుకంటే సుధీర్,రష్మీల
జంటకున్న పాపులారిటీ మనకు తెలిసందే. హైపర్ ఆది పంచ్ ల కోసమే కొందరు జబర్దస్త్ చుస్తారనడంలొ అనుమానం
లేదు. అయితే ఈంద్య ఆది తన స్కిట్లలో అనసూయతో డాన్సులు చేస్తూ, పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను
బాగా అలరిస్తూ పాపులర్ అయింది ఈ జంట. ఈ పాపులారిటీని ఉపయోగించుకొని తమ ప్రోగ్రాం ని సక్సెస్స్ చేయాలని
ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అయితే దీనికి హైపెర్ ఆది, అనసూయ నుండీ గ్రీన్ సిగ్నల్ వచినట్టు
సమాచరం. కాని రష్మి, సుధీర్ లు మాత్రం తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని విడిచి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారని సమాచారం.
ఒకవేల హైపర్ ఆది, అనసూయ లు జబర్దస్త్ ని వీడితే ఇక మొత్తం జబర్దస్త్ ని తమ
భుజాలపై మోయాల్సిన భాద్యత సుధిర్ రష్మిలపై ఉంటుందని చెప్పాలి.
No comments:
Post a Comment