Saturday, 23 November 2019

రవ్వ దోసె-తయారీ విధానం


రవ్వ దోసె

కావాల్సిన పదార్దాలు: 

బొంబాయి రవ్వ (1 కప్),
పెరుగు(సరిపడినంత),మైదా(1 కప్),
గోధుమ పిండి(కొంచెం),
ఉప్పు (తగినంత).

తయారీ విధానం:

  ఒక గిన్నెలో రవ్వ,పెరుగు,మైదా,గోధుమ పిండి అన్ని వేసి కలుపుకోవాలి. దోసె లు రావడానికి అనుకూలంగా నీళ్ళు కలుపుకోవాలి.తగినంత ఉప్పు వేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని  ఒక పావుగంట సేపు నాననివ్వాలి.తర్వాత  దోసెలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.నచ్చిన వాళ్ళు సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పిండి లో కలుపుకోవచ్చు.     


No comments:

Post a Comment