Sunday 10 May 2020

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు.


తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు.

  • ఒక్కసారిగా ఉలిక్కి పడిన యాదాద్రి భువనగిరి జిల్లా.
  •   నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు. 













ఇప్పటివరకు తెలంగాణాలో ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాగా యాదాద్రి భువనగిరి ఉంది. ఈ జిల్లా మొదటినుండి గ్రీన్ జోన్‌లోనే ఉంది. అయితే తాజాగా ఈ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.     

 3 కేసులు ఆత్మకూర్ (ఎం), ఒక కేసు సంస్థాన్ నారాయణపురంలో నమోదైనట్టు వెల్లడించారు. వీరందరు ముంబయి నుండి తమ సొంత గ్రామాలకు వచ్చిన వారేనని తెలిపారు.

కరోనా సోకినవారి  ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.    

No comments:

Post a Comment