తెలంగాణ యాదాద్రి
భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు.
- ఒక్కసారిగా ఉలిక్కి పడిన యాదాద్రి భువనగిరి జిల్లా.
- నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
ఇప్పటివరకు తెలంగాణాలో
ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాగా యాదాద్రి భువనగిరి ఉంది. ఈ జిల్లా మొదటినుండి గ్రీన్
జోన్లోనే ఉంది. అయితే తాజాగా ఈ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.
3 కేసులు ఆత్మకూర్ (ఎం), ఒక కేసు సంస్థాన్ నారాయణపురంలో
నమోదైనట్టు వెల్లడించారు. వీరందరు ముంబయి నుండి తమ సొంత గ్రామాలకు వచ్చిన వారేనని తెలిపారు.
కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు
నిమగ్నమయ్యారు.
No comments:
Post a Comment