Wednesday 25 March 2020

ఉగాది రోజున మెగాస్టార్ ఫాన్స్‌కి పండగలాంటి వార్త

ఉగాది రోజున  మెగాస్టార్ ఫాన్స్‌కి పండగలాంటి వార్త


మెగాస్టార్  చిరంజీవి, ఈ రోజు ఉగాది సందర్భంగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే తనుకూడా సోషల్ మీడియా అకౌంట్స్‌ని ప్రారంభించనున్నారు. ఈ విషయని స్వయంగా చిరంజీవి తన అభిమానులకు కొణిదెల   ప్రొడక్షన్స్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు.

ఇక మీదట చిరంజీవి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రాం లలో కనిపించనున్నరు. ఇకపై తన మన్సులో భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోనున్నారు. 

ప్రస్తుతం చిరంజీవి 152వ సినిమా ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు.  ఇందులో హీరోయిన్‌గా కాజల్  అగర్వాల్ నటిస్తోంది.  చాల రోజుల తరువాత చిరంజీవి సినిమాకి మణిశర్మ సంగీతం అందిచనున్నాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఇందులో రాం చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చరణ్ సరసన రష్మిక  మందాన నటిస్తోంది.   

No comments:

Post a Comment