ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్
కేజిఎఫ్ అనగానే యష్తో పాటు వినిపించే పేరు ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ దర్శకుడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగి పోయింది. అప్పట్లో జూ. ఎన్ టి ఆర్, మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. అవేవీ జరగలేదు, వాళ్ళు వేరే సినిమాలకు కమిట్ అయ్యారు. దీంతో ప్రభాస్ని కలిసిన ప్రశాంత్ నీల్, తనతో సినిమాకి ఒకే అనిపించుకున్నాడట.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా డైరెక్టర్ రాధాక్రిష్ణతో జాన్ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. నాగ్ అశ్విన్ మహానటి సినిమాని అద్భుతంగా తెరకెక్కించడంతో, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి నిర్మాత అశ్వినీ దత్ కావడం విశేషం.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా, ప్రశాంత్ నీల్ కేజిఎఫ్2 సినిమాల తర్వాత వీరిద్దరి సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
No comments:
Post a Comment