Thursday 21 May 2020

చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బొమ్మరిల్లు హాసిని....


చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బొమ్మరిల్లు హాసిని....


ఒకప్పుడు క్రేజీ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో తమ హవా చాటిన వాళ్ళు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోవడం సహజం. హీరోయిన్లు కొంతకాలం నటించాక పెళ్ళిళ్ళు చేసుకోవడంతో వారు వాళ్ళ హీరోయిన్ల అవకాశాలను కోల్పోతున్నారు. తరువాత ఫ్యామిలి పిల్లలు అంటూ సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు. మళ్ళి నటించే అవకాశలకోసం ఎదురు చూస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు.

అయితే ఇప్పుడు ఒకప్పడు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బొమ్మరిల్లు హాసిని జెనీలియా. బాలీవుడ్ హిరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయింది.  10ఏళ్ళు ఫ్యామిలి, పిల్లలు అని సినిమాని పక్కనబెట్టింది.

 ఇప్పుడు జెనీలియా చిరంజీవి నటించే లూసిఫర్  సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు, ఆ సినిమాలో కీలక పాత్ర కోసం జేనిలియాని సంప్రదించినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

దీనితో పాటు పాత తరం హీరోయిన్లను తన సినిమాలతో రీ ఎంట్రీ చేయించే త్రివిక్రమ్, తను ఎన్టిఆర్ తో చేయబోయే సినిమాలో జెనీలియాను తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

జెనీలియా, వెల్ కం బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ. 

No comments:

Post a Comment