కత్రిన కైఫ్ , దీపికా పదుకొనె ఇప్పుడు ఆలియా భట్...... ఇంతకీ ప్రభాస్ తో ఎవరు?
ప్రస్తుతం బాహుబలి స్టార్
ప్రభాస్ జిల్ ఫేం రాధాక్రిష్ణ దర్శకత్వలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్
లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ సినిమాలో
ప్రభాస్ ని డైరెక్టర్ కొత్తగా
చూపించాబోతున్నాడట.
ఈ సినిమా చేస్తూనే ప్రభాస్
మరో ప్రతిష్టాత్మక సినిమాకి సంతకం చేసాడు. మహానటి ఫేం నాగ్ అశ్విన్ తో ఒక సూపర్ హిరో
సినిమా తెరకెక్కుతోంది. దీనిని నిర్మాత అశ్విని దత్ చాలా ప్రతిష్టాత్మకంగా
నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని
అశ్విని దత్ భారీ బడ్జెట్ సినిమా గా తెరకేక్కిస్తున్నాడట. ఈ సినిమాని కుడా పాన్
ఇండియా సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టులను
సెలెక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా హిరోయిన్ని
కుడా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొనెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు , దీపికా కి రూ.
15 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం
జరిగింది.
ఇప్పుడు కొత్తగా ఇంకొక వార్త
ప్రచారంలో ఉంది. అదే ప్రభాస్,, నాగ్ అశ్విన్ కలయికలో వచ్చే సినిమాలో హిరోయిన్ గా
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ నటించాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొదట కత్రిన, తరువాత దీపికా
ఇప్పుడు ఆలియా భట్. మరి ప్రభాస్ తో నటించేది ఎవరో. ఇంకా ఎవరెవరి పేర్లు ప్రచారంలోకి
వస్తాయో చూడాలి మరి.
No comments:
Post a Comment