ఆసక్తి రేపుతున్న కీర్తి
సురేష్ పెంగ్విన్ ట్రైలర్ ....
మహానటి సినిమాతో ఒక్కసారి ఇండియన్
సినిమా తనవైపు చూసేలా చేసుకుంది జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్.
తెలుగు వాళ్లకు, కీర్తి
సురేష్ మహానటిగానే అందరికి గుర్తుండిపోయింది. అంతలా కీర్తి సావిత్రి పాత్రలో
జీవించింది. అంతే ఆసక్తిగా కీర్తి లేటెస్ట్ మూవీ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆ సినిమాయే పెంగ్విన్.
దక్షణాది భాషల్లో విడుదల అవుతున్న
ఈ సినిమాను , కరోనా వల్ల 70mm స్క్రీన్ పై చూడలేకపోతున్నాము. ఈ సినిమా OTT దిగ్గజం అమెజాన్
ప్రైమ్ లో ఈ నెల 19 వ తేదిన విడుదల కాబోతోంది.
ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల అయింది.
సైకలాజికల్ త్రిల్లర్ గా ఈ
సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి లీడ్ రోల్ చేస్తోంది. ఒక సైకో సాగిస్తున్న
ఆకృత్యాలకు బలైన కొందరు చిన్నారుల కథతో ఈ సినిమా రూపొందించబడింది. ఆ సైకోని కీర్తి
ఎలా ఆటకట్టించింది అనేది ఈ సినిమా కథగా చెప్పుకోవొచ్చు.
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించగా, ఈశ్వర్ కార్తీక్ ఈ
సినిమాకి దర్శకత్వం వహించారు.
No comments:
Post a Comment