ప్రభాస్ అభిమానులకు
పండగలాంటి వార్త...... త్వరలో కొత్త సినిమా పేరు, ఫస్ట్ లుక్ విడుదల...
ప్రభాస్ కొత్త సినిమా
గురించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాహో సినిమా తరువాత, జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఒక షెడ్యూలు జార్జియాలో పూర్తి చేసుకుంది. దాని తరువాత కరోనా వల్ల
దేశం మొత్తం లాక్ డౌన్ అయినసంగతి తెలిసిందే. దాని వల్ల అన్ని సినిమా షూటింగులు
ఆగిపోయాయి. కానీ ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి
కొత్త న్యూస్ రాక పోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. మిగతా హీరోలు
తమ సినిమా అప్డేట్స్ ని అభిమానులతో
పంచుకుంటున్నారు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ కొత్త సినిమా విశేషాల్ని
అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల రెండు లేదా మూడో వారంలో సినిమాకి
సంబంధించిన పేరుని, లుక్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. జాన్, రాధే
శ్యామ్ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే
నటిస్తోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. ఇతర
నటినటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ప్రకటించాల్సి
ఉంది.
No comments:
Post a Comment