తెలంగాణాలో ఒక్కరోజే 61 కరోనా కేసులు నమోదు.
కరోనా మహమ్మారి
తన ప్రతాపం ఇంకా చూపుతోంది. తెలంగాణాలో ఒక్క రోజే 61 పాసిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మరోవైపు కరోనాతో ఒకరు మరణించగా, మరణాల సంఖ్య 17కి
చేరుకుంది. అలాగే కరోనా బారిన పడిన వారి సంఖ్య 592కి చేరుకుంది.
అయితే అత్యధికంగా
216 మంది కరోనా సోకిన వారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, అందులో 51 మంది డిశ్చార్జి అయినట్టు
అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం
తగిన చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment