శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో భక్తుల దర్శనానికి
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
చాల రోజుల నుండి తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు శుభవార్త. తిరుమలలో భక్తుల
దర్శనానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొన్ని
షరతులతో కూడిన అనుమతినిచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో
కూడిన దర్శనాలను నిర్వహించనుంది. వీరికి ఆరడుగుల సామాజిక దూరం పాటిస్తూ దర్శనం
కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది.
భక్తుల దర్శనాల నిమిత్తం టీటీడీ ఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వం కొన్ని
షరతులతో భక్తుల దర్శనానికి అనుమతినిచ్చింది.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వీ . ప్రసాద్ టీటీడీ కి ఈ
ఉత్తర్వులను జారీ చేశారు.
మరి ప్రభుత్వ అనుమతితో టీటీడీ, భక్తులకు ఎప్పటినుండి దర్శనానికి వీలును కల్పిస్తుందో వేచి చూడాలి.
No comments:
Post a Comment