మహేష్ బాబు తన అభిమానులతో
చిట్ చాట్
నిన్న సూపర్ స్టార్ కృష్ణ
పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు తన కొత్త సినిమా సర్కారు వారి పాట టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి
తెలిసేందే. ఈ సినిమా పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా పోస్టర్ ని చూసాక ఫ్యాన్స్ సినిమా
స్టోరీని వివిధ రకాలుగా ఉహించుకోవడంమొదలు పెట్టారు. చేపికి పోగు, మెడపై రూపాయి టాటూ, గంట గుర్తు ఇవ్వన్ని సర్కారు వారి
పాట సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా మహేష్ బాబు
ఫ్యాన్స్ తో నిన్న సాయంత్రం instagram వేదికగా చిట్ చాట్ చేసాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం
ఇచ్చాడు. కొందరు అభిమానులు
సర్కారు వారి పాట సినిమా
హిరోయిన్ ఎవరు అని అడిగితే, ఎవరైతే బాగుంటుందో మీరే చెప్పండి అని అన్నాడు.
ఈ సాయంత్రం వర్షం పడుతోంది,
మీరు ఏ స్నాక్స్ తింటారు అంటే, మిర్చి
బజ్జి,అల్లం టీ అని సమాదానమిచ్చాడు.
రాజమౌళి తో సినిమా ఎప్పుడు
అని అడగగా, తప్పకుండా ఉంటుంది అని చెప్పాడు.
ఎవరిమీదైనా క్రష్ ఉందా అన్న
ప్రశ్నకు సమాధానంగా, 26 సంవత్సరాల వయసులో ఓ
అమ్మాయి మీద మనసు పడ్డానని,
తరువాత ఆ అమ్మాయినే పెళ్లి
చేసుకున్నానని, ఆమె ఎవరో కాదు నమ్రత అని
చెప్పాడు.
అలాగే గౌతమ్ , సితార ల్లో
ఎవరు అంటే ఎక్కువ ఇస్టమని అడిగితే, ఇద్దరు తనలో భాగమని, ఇద్దరు ఒకటే అని
చెప్పాడు.
గౌతమ్ హీరో అవుతాడా అన్న
ప్రశ్నకు, వాడికి హీరో అవ్వాలని
ఉందనుకుంటున్నా, ఈ ప్రశ్నకు సమయమే సమాధానం చెపుతుందని చెప్పాడు.
No comments:
Post a Comment