Sunday, 10 November 2019

“అల వైకుంఠపురంలో” ఆడియో సక్సెస్ - తీవ్ర ఒత్తిడిలో దేవీశ్రీప్రసాద్


     "అల వైకుంఠపురంలో" రెండు పాటలు విడుదలై యూట్యుబ్  లో రికార్డ్స్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  "సామజ వరగమనా మరియు రాములో రాములో"  పాటలు విడుదలై ఇన్ని రోజులైనప్పటికి ఇంకా ఆదరణ పెరుగుగుతూ వస్తోంది. ఈ పాటలను మైమరిపించే పాటలు ఇంకా రాలేదనే చెప్పాలి.

           ఈ పాటలు ట్రెండ్ క్రియేట్ చేయడంతో ఎస్ ఎస్ తమన్ ఒక్కసారిగా ఫాంలోకి వచ్చాడు. త్రివిక్రం దర్షకత్వం వహిస్తున్న సినిమా ఈ సంక్రాతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు  ప్రతిష్టాత్మక చిత్రం, అనిల్ రావిపూడి దర్షకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదలవుతోంది . అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సాంగ్స్ రిలీజ్  చేయలేదు. ఎప్పుడో  విడుదైన ఇంట్రడక్షన్ సాంగ్ బిట్ ఫాన్స్ ని నిరాశపరిచిందనే చెప్పాలి. ఇందులో  కొత్తదనం లేకపోవడం ఇందుకు కారణం.

ఇప్పుడు  మహేష్ బాబు ఫాన్స్ అందరు దేవీశ్రీప్రసాద్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అల వైకుంఠపురంలో పాటలు  విడుదలై విపరీతమైన క్రేజ్ ని సంపాందించి ఆ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. కాని సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి  ఎలాంటి పాటలు, విడుదల కాకపోవడం వల్ల  ఫాన్స్ ఒకరకమైన నిరాశకు గురవుతున్నారు.

అలాగే ఈ మద్య దేవీశ్రీప్రసాద్ బ్లాక్ బస్టర్ పాటలు ఇవ్వకపోవ్వడం ఫాన్స్ ని కలవరపెడుతోంది.  దీనితో మహేష్ బాబు ఫాన్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇవ్వాలని దేవీపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్  లొ పోస్టులు పెడుతూ దేవీపై ఒత్తిడి తెస్తున్నారు. 

No comments:

Post a Comment