తెలంగాణలో
రేపు 24 గంటలు బంద్
తెలంగాణా
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,రేపు తెలంగాణాలో 24 గంటల
బంద్ని పాటించాలని పిలుపునిచ్చారు.
జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంట నుండి రాత్రి
9 గంటల వరకు ఉంటే, తెలంగాణాలో మాత్రం ఉదయం 6 గంటల నుండి మరుసటి
రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుందని
సి.యం కె సి
ఆర్ ఇవ్వాల జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రకటించారు.
ఈ బంద్ సమయంలో ఆర్టీసి
సేవలు, మెట్రో రైలు సేవలు మూసివేస్తున్నట్టు
ప్రకటించింది. అంతరాష్ట్రీయ బస్సు సర్విసులను కూడా రద్దు
చేస్తున్నట్టు ప్రకటించింది.
కరోన
వ్యాప్తి నివారణకు ప్రజలంతా
సహకరించాలని పిలుపునిచారు.
విదేశాలనుండి
వచ్చినవారు దయచేసి రిపోర్ట్ చేయండి, మీకు చేతులెత్తి దండం
పెడుతున్న అని సియం కె
సి ఆర్ అన్నారు.
సమాజానికి ముప్పు తీసుకు రావొద్దు అని ఆయన అన్నారు.
No comments:
Post a Comment