హర్ట్ అయిన మెగాస్టార్.... అప్పటివరకు షూటింగ్ లేనట్లే...
బాలకృష్ణ వ్యాఖ్యలకు
చిరంజీవి హర్ట్
ఆచార్య షూటింగ్ ఇప్పట్లో
లేనట్లే
ఇప్పుడు టాలీవుడ్ అంతర్గత
వివాదాలతో అట్టడుకుతోంది. ఇండస్త్రిలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. లాక్ డౌన్ కారణంగా సినిమా
షూటింగులు లేక రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి
చొరవ తీసుకొని, ముందుండి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ముందుకు
వెళ్ళిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని, మిగతా సినీ పెద్దలు
పాల్గొని చర్చలు జరిపిన సంగతి తెల్సిందే.
ఈ చర్చల నేపథ్యంలో బాలకృష్ణ
చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. మంత్రి తో కలిసి భూములు పంచుకున్నారా అని
అనటంతో, ఆ మీటింగ్ లో చిరంజీవి ఉండడం ఇది చిరంజీవికి ఇబ్బంది కలిగించినదనే
చెప్పింది. దీనికి తమ్ముడు నాగబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ మొన్న ఒక వెబ్
చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడుతూ, అప్పుడు నిధుల కోసం US వెళ్లారు కదా.
రూ.5 కోట్ల వరకు వచ్చాయన్నారు. చిరంజీవి కుడా వెళ్ళాడు కదా , మొదట రూ.5
కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.కోటి
అంటున్నారు. మిగతా రూ. 4 కోట్లు ఏమైనట్టు అని అని అడిగారు. అందుకే నేను ఇన్వాల్వ్
కాను అని బాలక్రిష్ణ అనడం జరిగింది. నాగబాబు అన్నదానికి మీరు ఏమిమట్లాడర అన్నదానికి ఇండస్ట్రీ అంతా నాకు సపోర్ట్గా ఉన్నప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నారు. ఇప్పుడు
దీనిగురించి కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంలో కూడా చిరంజీవి
పేరు ప్రస్తావించడంతో, ఈ వ్యాఖ్యలు చిరంజీవిని వివాదంలో పడేసిండానే చెప్పాలి.
ఎందుకంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి సమాదానం చెప్పాల్సిన బాధ్యత చిరంజీవిపై పడింది.
ఈ విషయమై చిరంజీవి తీవ్రంగా
బాధ పడ్డాడని, దానితో ఇకముందు జరిగే సమావేశాలు, ఈ నెల చివరికి ప్రారభం కావాల్సిన
తన సినిమా ఆచార్య షూటింగ్ ని ఆపేశారు.
ప్రస్తుతానికి చిరంజీవి షూటింగ్ మొదలు పెట్టే మూడ్ లో లేరని ఇండస్ట్రీ వర్గాలు
చర్చించుకుంటున్నాయి.
ఇంకా ఈ వివాదం ఎంత దూరం
వెళుతుందో లేక చిరంజీవి స్పందించి ఈ
వివాదాన్ని ముగిస్తారో వేచి చూడాల్సిందే.
Let's wait and see
ReplyDeleteJai Balaiah...😍😍
ReplyDelete