Saturday 14 November 2020

నాని 28వ సినిమా మైత్రీ మూవీస్ తో ..... దర్శకుడు వివేక్ ఆత్రేయ... #Nani28 with Mythri Movie Makers

 

Image Source: Twitter / @NameisNani


నాచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీద ఉన్నాడు. సినిమాలను వరుస పెట్టి మొదలు పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. ఇప్పుడు దీని తరువాత సినిమా మైత్రీ మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు. దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని నాని  ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా సినిమాతో మంచి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు పలు రకాల అవార్డులు కూడా వచ్చాయి. దీనితో బడా సంస్థలు ఆత్రేయతో సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నాయి. ఈ సినిమాలో రాజు రాణి సినిమా ఫేం నజ్రియా హిరోయిన్ గా నటిస్తోంది.


అయితే సినిమా టైటిల్ ని ఈ నెల 21 వ తేదిన ప్రకటించనున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఈ సినిమాకి సంభందించిన ఇతర సాంకేతిక నిపుణుల గురించి ఆరోజు ప్రకటించే అవకాశం ఉంది.


No comments:

Post a Comment