Wednesday 18 November 2020

100 కోట్ల మంది వీక్షించిన మొదటి ఇండియన్ సాంగ్ గా రికార్డు సృష్టించిన రౌడీ బేబీ సాంగ్.

 

Image Source: Youtube



కొన్ని పాటలు ఎన్ని సార్లు  విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది.. ఆ మ్యూజిక్ అవ్వొచ్చు, ఆ పాటలోని డ్యాన్స్, హీరో హీరోయిన్ల కోసం ఇలా ఏదైనా అయి ఉండవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా / యూట్యూబ్ వచ్చాక ఒక పాట ఎంతగా నచ్చింది అనేదానికి ఒక కొలమానం వీక్షకులు.  ఎంత ఎక్కువమంది వీక్షిస్తే అంత ఎక్కువ పాపులర్ అయినట్టు లెక్క.


అయితే ఈ కోవలోకి వచ్చిన మన సౌత్ ఇండియన్ సినిమా మారి-2 నుండి వచ్చిన రౌడీ బేబీ పాట. ఈ పాట విడుదల అయినప్పటినుండి మంచి క్రేజ్ ని సమాదికుంది. ధనుష్ తానే స్వయంగా రాసి, పాడిన పాటకు  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఈ పాటకు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఈ పాటలో హీరో ధనుష్ కి జోడిగా ఫిదా ఫేం సాయి పల్లవి కాళ్ళు కదిపింది. ఈ పాట మ్యూజిక్ పరంగా మంచి పాట అవ్వడం, డ్యాన్స్ పరంగా ధనుష్, సాయి పల్లవి ఆకట్టుకోవడంతో ఈ పాటకి వీక్షకులు బ్రహ్మ రథం పట్టరాని చెప్పొచ్చు. అందుకే ఈపాట ఎక్కువ వీక్షకులను సంపాదించింది.


1 బిలియన్  (100 కోట్లు) వ్యూస్ సమాదించిన మొదటి ఇండియన్ వీడియో సాంగ్ గా ఈ రౌడీ బేబీ సాంగ్ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ సినిమా టైగర్ జిందా హై సినిమా నుండి స్వాగ్ సే స్వాగత్ 866 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.


అయితే ఇంతకుముందు సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలోని  వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే పాటతెలియని, వినని వాళ్ళు ఉండరు. ఈ పాట కూడా యూట్యూబ్ ని షేక్ చేసిందనే చెప్పొచ్చు.  సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సాధ్యం కాని రికార్డులను సృష్టించింది. 


ఇక్కడ యాద్రుశ్చికమో ఏమో తెలియదు కానీ, రికార్డులు సృష్టించిన రెండు పాటల్లోనూ సాయి పల్లవి నటించింది.


No comments:

Post a Comment