Friday 20 November 2020

Telugu Movie News: ముగిసిన నాగ చైతన్య , సాయి పల్లవి “లవ్ స్టోరీ” ...

 

Image Source: Twitter /  @SVCLLP




నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేకర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే మంచి కాఫీలా ఉంటుందని మనకు తెలిసిందే. కుటుంబం, ప్రేమ, స్నేహం వీటికి ఈ దర్శకుని సినిమాల్లో ఎక్కువ ప్రాదాన్యం కనిపిస్తుంది. మద్యలో కొంచెం వెనుకపడినా ఫిదా సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. దీనితో నాగ చైతన్య తో ఏకంగా లవ్ స్టొరీ సినిమాని తీస్తున్నాడు. తనకు ఫిదా సినిమాతో కలిసొచ్చిన సాయి పల్లవినే ఈ సినిమాలో హిరోయిన్ గా తీసుకున్నాడు.


ఈ చిత్రం కూడా శేఖర్ కమ్ముల శైలి లో రియలిస్టిక్ ప్రేమకథ గా రూపుదిద్దుకోనుంది. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో చేసిన నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశాం, థియేటర్లు తెరుచుకుని, ప్రేక్షకుల సందడి మొదలైతే లవ్ స్టోరీ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని చిత్ర వర్గాలు తెలియజేసాయి.


ఈ సినిమాకి సంగీతం పవన్ సి.హెచ్ అందించారు. ఈ చిత్రానికి నిర్మాతలు కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు.  


No comments:

Post a Comment