Tuesday 24 March 2020

రిలయన్స్ జియో క్రొత్త ప్రీ పెయిడ్ ప్లాన్


రిలయన్స్ జియో క్రొత్త ప్రీ పెయిడ్ ప్లాన్
 
కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్ని బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుండే పని చేయాలని ఆదేశించాయి. కానీ ఇంటర్నెట్ లేకుండా ఈ కాలంలో పని చేయడం  అనేది చాలా కష్టం. జియో మొబైల్ వచ్చాక ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా జియో సంస్థ ఇంట్లో ఉండి పని చేసేవారికోసం కొత్త ప్రిపేయిడ్ ప్లాన్‌ని తెచ్చింది.      

ఈ జియో ప్లాన్ రూ. 251 గా నిర్ణయించారు, ఈ ప్లాన్‌లో  రోజుకు 2 జిబి డాటా, 51 రోజుల వాలిడిటితో అందిస్తున్నారు. టోటల్‌గా 102 జిబి డాటా ఈ ప్లాన్‌తో పొందవచ్చు. డాటా లిమిట్ అయిపోయాక కూడా యూజర్స్ 64 కెపిబిస్ స్పిడ్‌తో ఇంటర్నెట్‌ని వాడుకోవచ్చు.

అయితే ఇక్కడ  గమనిచాల్సింది ఏంటంటే ఈ ప్లాన్‌లో  డాటా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కాల్స్ లేక ఎస్ ఎం ఎస్ కోసం ఈ ప్లాన్ వర్తించదు.

కాబట్టి డాటా మాత్రమే వాడుకోవాలనుకునేవారు ఈ ప్లాన్‌ని రిచార్జ్ చెయిచుకోండి. మై జియో వెబ్ సైట్ లోకి వెళ్ళి , 4 జి వోచర్స్‌లో ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవొచ్చు.     

No comments:

Post a Comment