ప్రభాస్ – నాగ్ అశ్విన్
మూవీ గురించి అభిమానులకు కిక్కిచ్చే న్యూస్
ప్రభాస్ తన 20వ చిత్రం జిల్
ఫేం రాదా కృష్ణ తో చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మహానటి ఫేం నాగ అశ్విన్ తో
సినిమా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మహానటి తో మంచు గుర్తిపు తెచ్చుకున్న నాగ్
అశ్విన్, క్రిటిక్స్ నుండి కూడా ప్రశంశలు పొందాడు. ఈ సినిమా ఘన విజయం సాధించి పలు
రికార్డులను సృష్టించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా
లభించిన విషయం తెలిసిందే.
మహానటి తరువాత నాగ్ అశ్విన్
ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ సినిమా కూడా జాతీయ స్థాయి గుర్తిపు
రావాలని ఆశిస్తున్నారు అభిమానులు. ఇప్పడు ఇండస్ట్రి
లో ఈ సినిమా గురించే చర్చ.అయితే బాహుబలి సిరిస్
తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా
గుర్తించారు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ అభిమాన గణం ప్రపంచం నలుమూలలకు పాకింది. నాగ్ అశ్విన్ ప్రభాస్ ప్రపంచస్థాయి అభిమానులను
దృష్టిలో ఉంచుకొని పాన్ ఇంటర్నేషనల్ మూవీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రభాస్ ని పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా పరిచయం
చేయబోతున్నాడు. దీనికోసం ఈ సినిమాని విదేశీ భాషల్లో విడుదలకు సన్నాహాలు
చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ సినిమాకు తగ్గట్టే ఆర్టిస్టులను వివిధ సినీ
పరిశ్రమల నుండి ఎంపిక చేస్తున్నారు. దీనితో పాటు హాలివుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమాకి పనిచేయబోతున్నారట.
ఇదంతా ఒకటైతే, ఈ సినిమాకి
సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రి లో హల్ చల్ చేస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో
ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అందుకోసం
హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వేయబోతున్నారట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400
కోట్ల వరకు అవుతుందని అంచనా.
అయితే ఈ సినిమాని వీలైనంత
త్వరగా మొదలుపెట్టి, 2022, సమ్మర్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్
చేస్తున్నారని సమాచారం.
No comments:
Post a Comment