Thursday 21 January 2021

TRS ప్రభుత్వానికి హై కోర్టు లో చుక్కెదురు


 



ఎల్ఆర్ఎస్ , బిఆర్ఎస్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది . ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ , బిఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ తేలేవరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసిం ది . రాష్ట్ర ప్రభుత్వం 2016 లో బిఆర్ఎస్ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు స్వీకరించింద. దీనిపై హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2016 లో తీసుకొచ్చిన బిఆర్ఎస్ పథకంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి .


వీటన్నంటిపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఎల్ఆర్ఎస్ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఎజి వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సిజె జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం ఎజిని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ రుసుము గడువు ఈ నెల 31 తో ముగుస్తోందని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా .. ఎల్ఆర్ఎస్ , బిఆర్ఎస్ కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది .

No comments:

Post a Comment